యాప్నగరం

కుప్పం: మట్టిదిబ్బలో బంగారు నాణేలు, ఎగబడ్డ జనం.. భారీగా ట్రాఫిక్ జామ్!

ఏపీ, తమిళనాడులో సరిహద్దులో బంగారు నాణేలు బయటపడ్డాయన్న వార్త సంచలనం రేపింది.

Samayam Telugu 10 Oct 2020, 11:37 pm
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో మట్టిదిబ్బలో బంగారు నాణేలు బయటపడటం సంచలనం రేపింది. కుప్పం సరిహద్దులో తమిళనాడుకు చెందిన హోసూర్‌ సమీపంలో రోడ్డు పక్కనే మట్టిదిబ్బలో బంగారు నాణేలు కనిపించాయి. దీంతో వాటిని ఏరుకునేందుకు జనాలు ఎగబడ్డారు. ఈ విషయం చుట్టుపక్కల తెలియడంతో పెద్ద ఎత్తున జనాలు అక్కడి చేరుకున్నారు. బంగారు నాణేల కోసం ఎగబడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది.
Samayam Telugu బంగారు నాణేలు (ప్రతీకాత్మక చిత్రం)


బంగారం కోసం జనాలు భారీగా చేరుకోవడంతో హోసూరు- బాగలూర్‌ హైవేపై కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. ప్రజలకు దొరికిన బంగారు నాణెం ఒక్కొక్కటి 2 గ్రాములు ఉంటుందని సమాచారం.

బంగారం కోసం జనాలు భారీగా చేరుకోవడం, ట్రాఫిక్ జామ్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మట్టిదిబ్బలోకి బంగారు నాణేలు ఎలా వచ్చాయన్నదానిపై పోలీసుల విచారణ ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.