జగన్ సర్కారుకు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఊహించని భారీ షాకిచ్చింది. పలు ఉల్లంఘనలకు సంబంధించి రూ. వందల కోట్లలో జరిమానా విధించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ ఎన్జీటీ ఏపీ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘనకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.120 కోట్ల జరిమానా విధించింది.
అలాగే, పర్యావరణ అనుమతులు లేకుండా కట్టిన మరో 3 ప్రాజెక్టులకు కూడా ఎన్జీటీ భారీ మొత్తంలో జరిమానా విధించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు సంబంధించి రూ. 24.56 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి రూ. 24.90 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు సంబంధించి రూ. 73.60 కోట్లు జరిమానా కొరడా ఝుళిపించింది. మొత్తంగా చూసుకుంటే ఏకంగా రూ. 243.06 కోట్ల జరిమానా విధించింది.
ఈ జరిమానాను 3 నెలల్లో చెల్లించాలని జగన్ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ఈ జరిమానా డబ్బు చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. జరిమానా నిధుల వినియోగంపై ఏపీ పీసీబీ, సీపీసీబీ సభ్యులతో కమిటీ నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతల ఉల్లంఘనలపై గతంలో ఎన్జీటీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు, పర్యావరణవేత్త పెంటపాటి పుల్లారావు, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ ఎన్జీటీకి ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదులను విచారించిన హరిత ట్రిబ్యునల్ రూ. వందల కోట్ల జరిమానా విధించింది.
అలాగే, పర్యావరణ అనుమతులు లేకుండా కట్టిన మరో 3 ప్రాజెక్టులకు కూడా ఎన్జీటీ భారీ మొత్తంలో జరిమానా విధించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు సంబంధించి రూ. 24.56 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి రూ. 24.90 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు సంబంధించి రూ. 73.60 కోట్లు జరిమానా కొరడా ఝుళిపించింది. మొత్తంగా చూసుకుంటే ఏకంగా రూ. 243.06 కోట్ల జరిమానా విధించింది.
ఈ జరిమానాను 3 నెలల్లో చెల్లించాలని జగన్ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ఈ జరిమానా డబ్బు చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. జరిమానా నిధుల వినియోగంపై ఏపీ పీసీబీ, సీపీసీబీ సభ్యులతో కమిటీ నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతల ఉల్లంఘనలపై గతంలో ఎన్జీటీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు, పర్యావరణవేత్త పెంటపాటి పుల్లారావు, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ ఎన్జీటీకి ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదులను విచారించిన హరిత ట్రిబ్యునల్ రూ. వందల కోట్ల జరిమానా విధించింది.