యాప్నగరం

దసరాకు హైదరాబాద్‌ బస్సులు లేనట్లే.. పండగ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్

ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ పండగ చేసుకుంటున్నాయి. దసరా కాడంతో టికెట్‌ ఛార్జీలు పెంచేస్తున్నారు. దసరా దగ్గరపడుతున్న కొద్దీ ఛార్జీలు రెట్టింపు చేస్తున్నారు.

Samayam Telugu 19 Oct 2020, 7:13 am
ఏపీ నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులు ఇప్పట్లో లేనట్లే. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో దసరాకు సర్వీసులు నడపటం కష్టమే అని వాదన వినిపిస్తోంది. దసరాకు కనీసం వారం ముందైనా బస్సులు ప్రారంభమవుతాయని అధికారులు భావించినా ఆ దిశగా అడుగులు పడటం లేదు. దీంతో హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు తప్పేలా లేవు.
Samayam Telugu ఏపీఎస్ ఆర్టీసీ


తెలంగాణ ఆర్టీసీ చెప్పినట్లే ఆ రాష్ట్ర పరిధిలో రోజూ 1.61 లక్షల కి.మీ. నడుపుతామని ఏపీఎస్‌ఆర్టీసీ ఇటీవల ప్రతిపాదనలు పంపింది. కానీ తెలంగాణ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. సోమ, మంగళవారాల్లో అయినా నిర్ణయం తీసుకొని.. కొన్ని సర్వీసులు నడిపేందుకు ఓకే అంటే.. దసరాకు ఆర్టీసీ బస్సులు నడిపే అవకాశం ఉంటుంది. ఇటు హైదరాబాద్‌-బెంగళూరు మధ్య కర్నూలు, అనంతపురం మీదుగా సర్వీసులు నడుపుతామని టీఎస్‌ఆర్టీసీ కోరింది. ఏపీకి సర్వీసులపై తేల్చిన తర్వాతే బెంగళూరు సర్వీసులకు అనుమతిస్తామని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు తేల్చి చెప్పారు.

ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ పండగ చేసుకుంటున్నాయి. దసరా కాడంతో టికెట్‌ ఛార్జీలు పెంచేస్తున్నారు. దసరా దగ్గరపడుతున్న కొద్దీ ఛార్జీలు రెట్టింపు చేస్తున్నారు. ఉదాహరణకు ఇప్పటి వరకు హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో సూపర్‌లగ్జరీ, ఏసీ స్లీపర్‌లో ధర పెంచి ఆన్‌లైన్‌లో ముందస్తు టికెట్లు అమ్ముతున్నారు. హైదరాబాద్‌ నుంచి విశాఖ, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు వెళ్లే మార్గాల్లోనూ ఛార్జీలు భారీ పెంచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.