ఏపీలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్ల సహా అనధికార వ్యక్తుల్ని ఎంట్రీ లేదు. వారందరికి ప్రవేశాన్ని నిషేధించినట్టు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజీ రామకృష్ణ మెమో జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనల్ని ఉల్లంఘించి కార్యాలయాల్లోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల కాలంలో సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అనధికార వ్యక్తుల ప్రమేయం వల్లే అవినీతి జరుగుతోందని ఏసీబీ నివేదిక అందించింది. అధికారులు సీజ్ చేసిన డబ్బు లెక్కల్లోకి రానివిగా.. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్ల ద్వారానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరిందని తేలిందట. ఈ కారణంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆదేశాలపై డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థలో అవినీతి ఉందని భావించకూడదన్నారు.
ఇటీవల కాలంలో సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో భారీ అవినీతి బయటపడింది. నకిలీ చలాన్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంరేపింది. ఏసీబీ అధికారులు చేసిన తనిఖీల్లో అవకతవకలు బయటపడ్డాయి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కోసం చెల్లించే చలానాలను కొందరు దుర్వినియోగం చేసినట్లు తేలింది. రిజిస్ట్రేషన్ కోసం బ్యాంకుల్లో చలానా తీసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించాక.. కొందరు అవే చలానాలను మళ్లీ వినియోగిస్తున్నారని దర్యాప్తులో గుర్తించారు. దీంతో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవల కాలంలో సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో భారీ అవినీతి బయటపడింది. నకిలీ చలాన్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంరేపింది. ఏసీబీ అధికారులు చేసిన తనిఖీల్లో అవకతవకలు బయటపడ్డాయి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కోసం చెల్లించే చలానాలను కొందరు దుర్వినియోగం చేసినట్లు తేలింది. రిజిస్ట్రేషన్ కోసం బ్యాంకుల్లో చలానా తీసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించాక.. కొందరు అవే చలానాలను మళ్లీ వినియోగిస్తున్నారని దర్యాప్తులో గుర్తించారు. దీంతో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది.