యాప్నగరం

‘అమ్మ ఒడి’కి నోబెల్ గ్రహీత ప్రశంసలు.. ఆ ఎమ్మెల్యే ఫుల్ ఖుషీ

జగనన్న అమ్మ ఒడి పథకాన్ని మరో నోబెల్ అవార్డు గ్రహీత ప్రశంసించారు. జర్మనీకి చెందిన రాసాయనశాస్త్ర సైంటిస్ట్ జాన్ బి గెడెనఫ్ అమ్మ ఒడి పథకాన్ని కొనియాడినట్లు వైసీపీ ఎమ్మెల్యే రోజా ట్వీట్ చేశారు.

Samayam Telugu 28 Jan 2020, 9:20 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకానికి మరో విశిష్ట వ్యక్తి నుంచి ప్రశంస లభించింది. జర్మనీ దేశానికి చెందిన నోబెల్ అవార్డు గ్రహీత జాన్ బి గెడెనఫ్ అమ్మ ఒడి పథకాన్ని కొనియాడారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మంగళవారం (జనవరి 28) ట్వీట్ చేశారు.
Samayam Telugu goodenough


‘‘అక్షరం పేదరికాన్ని దూరం చేసే ఆయుధం. అక్షరాస్యత పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మ ఒడి’ ప‌థకాన్ని జ‌ర్మన్ నోబెల్ అవార్డు గ్రహీత జాన్ బి గుడెన‌ఫ్ ప్రశసించారు. జగనన్న చేసే మేలు ఖండాంతరాల దాటి కీర్తిని తెచ్చింది.’’ అని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. అలాగే ఈ ట్వీట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ట్యాగ్ చేశారు. జగనన్న అమ్మ ఒడి, అమ్మ ఒడి అనే హ్యాష్ ట్యాగ్‌లను జోడించారు.

Also Read: జగన్‌తో నోబెల్ గ్రహీత భేటీ.. అమ్మ ఒడిపై ప్రశంసల జల్లు

అమ్మ ఒడి పథకాన్ని ఇప్పటికే అనేక మంది ప్రముఖులు ప్రశంసిన విషయం తెలిసిందే. ఇటీవలే మన దేశానికి చెందిన నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి సీఎం జగన్‌తో భేటీ అయిన సందర్భంలోనూ అమ్మ ఒడి పథకాన్ని కొనియాడారు. ఈ పథకం వల్ల ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. తాజాగా, రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు పొందిన జాన్ బి గెడెనఫ్ కూడా అమ్మ ఒడిని ప్రశంసించడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.