యాప్నగరం

తణుకులో వైరస్ వణుకు.. చికెన్ తినొద్దు.. వైసీపీ ఎమ్మెల్యే అలర్ట్

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వణుకు పుట్టిస్తున్న వైరస్. వారం పాటూ నాన్‌వేజ్ హాలీడే ప్రకటించిన అధికారులు. చికెన్, మటన్ తినొద్దంటున్న తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు.

Samayam Telugu 11 Feb 2020, 3:38 pm
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఫౌల్ట్రీ పరిశ్రమను ఓ వైరస్ వణికిస్తోంది. కొద్దిరోజులుగా వరుసుగా ఫారాల్లో కోళ్లన్నీ చనిపోతున్నాయి. దీంతో నాన్‌వెజ్ అమ్మకాలను అధికారులు నిలిపివేశారు. వారం రోజుల పాటూ నాన్‌వేజ్ హాలీడే ప్రకటించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అమ్మకాలు నిలిపివేశామని అధికారులు చెబుతున్నారు. ప్రజలు కూడా అలర్ట్‌గా ఉండాలంటున్నారు.
Samayam Telugu ws


తణుకులో వైరస్ కారణంగా చనిపోయిన కోళ్లను కాలువల్లో, రోడ్ల పక్కన వేయకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్‌, ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బందిని అలర్ట్ చేశారు. ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా భావించి వారం రోజులు నాన్‌ వెజ్‌ హాలీడేగా ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తణుకు ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.