ఏపీలో టీడీపీకి వరుసగా షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. మొదట్లో చోటా మోటా నేతలు గోడ దూకేస్తే.. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్యేలు జగన్కు జైకొట్టారు. అధికారికంగా వైఎస్సార్సీపీలో చేరకపోయినా.. మద్దతు పేరుతో దగ్గరవుతున్నారు. తాజాగా విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జగన్ను కలిశారు.. తన కుమారులు ఇద్దర్ని దగ్గరుండి అధికార పార్టీలో చేర్పించారు.
Read Also: ఇంట్రెస్టింగ్: రాజకీయాలకు దూరంగా, అజ్ఞాతంలో జేసీ.. ఏం చేస్తున్నారంటే
ఇదిలా ఉంటే ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అదే నెంబర్ 19 సెంటిమెంట్.. యాధృచ్ఛికమే అయినా 19వ తేదీ వాసుపల్లి గణేష్కి వ్యక్తిగత జీవితంలో బాగా కలిసొచ్చిందట. 1988 సెప్టెంబర్ 19న ఆయన ఇండియన్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో పైలట్ ఆఫీసర్గా చేరారు. 1994 సెప్టెంబర్ 19న ఎయిర్ఫోర్స్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 1994 అక్టోబర్ 19వ తేదీన వైజాగ్ డిఫెన్స్ అకాడమీని ప్రారంభించారు. 2014 మార్చి 19న ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 2014 మే 19న తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు సెప్టెంబర్ 19నే ఆయన ఇద్దరు కుమారుల్ని కుమారులను వైఎస్సార్సీపీలో చేర్పించారు. ఈ లక్కీ నెంబర్ సెంటిమెంట్ మళ్ల వర్కౌటవుతుందని నమ్ముతున్నారు.
Also Read: తూ.గో: అమ్మో పులస.. ఒక్క చేప ధర తెలిస్తే దిమ్మ తిరగడం ఖాయం
ఇదిలా ఉంటే నెంబర్ 19 గణేష్కు కలిసొచ్చినా చంద్రబాబును మాత్రం టెన్షన్ పెడుతోంది.. దీని వెనుకా ఆసక్తికర కారణం ఉంది. ఎన్నికల్లో టీడీపీ నుంచి 23మంది ఎమ్మెల్యేలుగా వీరిలో వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్లు జగన్కు జైకొట్టారు. దీంతో టీడీపీకి 19మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.. ఇది ఓ విధంగా చంద్రబాబుకు కలిసి రాలేదనే చెప్పాలి.. అంతేకాదు ఆయన ప్రతిపక్ష హోదాకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నెంబర్ 19 పాపం టీడీపీ అధినేతకు అంతగా కలిసి రాలేదన్నమాట.
Read Also: ఇంట్రెస్టింగ్: రాజకీయాలకు దూరంగా, అజ్ఞాతంలో జేసీ.. ఏం చేస్తున్నారంటే
ఇదిలా ఉంటే ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అదే నెంబర్ 19 సెంటిమెంట్.. యాధృచ్ఛికమే అయినా 19వ తేదీ వాసుపల్లి గణేష్కి వ్యక్తిగత జీవితంలో బాగా కలిసొచ్చిందట. 1988 సెప్టెంబర్ 19న ఆయన ఇండియన్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో పైలట్ ఆఫీసర్గా చేరారు. 1994 సెప్టెంబర్ 19న ఎయిర్ఫోర్స్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 1994 అక్టోబర్ 19వ తేదీన వైజాగ్ డిఫెన్స్ అకాడమీని ప్రారంభించారు. 2014 మార్చి 19న ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 2014 మే 19న తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు సెప్టెంబర్ 19నే ఆయన ఇద్దరు కుమారుల్ని కుమారులను వైఎస్సార్సీపీలో చేర్పించారు. ఈ లక్కీ నెంబర్ సెంటిమెంట్ మళ్ల వర్కౌటవుతుందని నమ్ముతున్నారు.
Also Read: తూ.గో: అమ్మో పులస.. ఒక్క చేప ధర తెలిస్తే దిమ్మ తిరగడం ఖాయం
ఇదిలా ఉంటే నెంబర్ 19 గణేష్కు కలిసొచ్చినా చంద్రబాబును మాత్రం టెన్షన్ పెడుతోంది.. దీని వెనుకా ఆసక్తికర కారణం ఉంది. ఎన్నికల్లో టీడీపీ నుంచి 23మంది ఎమ్మెల్యేలుగా వీరిలో వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్లు జగన్కు జైకొట్టారు. దీంతో టీడీపీకి 19మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.. ఇది ఓ విధంగా చంద్రబాబుకు కలిసి రాలేదనే చెప్పాలి.. అంతేకాదు ఆయన ప్రతిపక్ష హోదాకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నెంబర్ 19 పాపం టీడీపీ అధినేతకు అంతగా కలిసి రాలేదన్నమాట.