ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని నంద్యాల పట్టణంలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో నంద్యాలలో 10 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఆంక్షలు కఠినతరం చేశారు. బుధవారం (ఈ నెల 15) నుంచి 25వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. అత్యవసర సర్వీసులకు మాత్రమే సడలింపు ఇచ్చారు. నిత్యావసర సరుకులు, రిటైల్ కూరగాయల అమ్మకాలకు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతిచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లాక్డౌన్ అమలులో ఉంటుంది. ప్రతి వ్యక్తి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ, డీఎస్పీ చిదా నందరెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాగా, రాష్ట్రంలోని మరో ఐదారు జిల్లాల్లోని వివిధ నగరాలు, పట్టణాల్లో లాక్డౌన్ కొనసాగిస్తున్నారు. ఉభయ గోదావరి, ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో నిబంధనలు అమల్లో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, అమలాపురంలో లాక్డౌన్ కొనసాగుతోంది. కాకినాడలో తిరిగి లాక్డౌన్ను కఠినంగా అమలు చేయనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలలో మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇటు ఏలూరు. తాడేపల్లిగూడెంలో పూర్తి లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. అనంతపురంలో కూడా మంగళవారం నుంచి లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాల, మార్కాపురంలలో లాక్డౌన్ కొనసాగిస్తున్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఆంక్షలు కఠినతరం చేశారు. బుధవారం (ఈ నెల 15) నుంచి 25వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. అత్యవసర సర్వీసులకు మాత్రమే సడలింపు ఇచ్చారు. నిత్యావసర సరుకులు, రిటైల్ కూరగాయల అమ్మకాలకు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతిచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లాక్డౌన్ అమలులో ఉంటుంది. ప్రతి వ్యక్తి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ, డీఎస్పీ చిదా నందరెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాగా, రాష్ట్రంలోని మరో ఐదారు జిల్లాల్లోని వివిధ నగరాలు, పట్టణాల్లో లాక్డౌన్ కొనసాగిస్తున్నారు. ఉభయ గోదావరి, ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో నిబంధనలు అమల్లో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, అమలాపురంలో లాక్డౌన్ కొనసాగుతోంది. కాకినాడలో తిరిగి లాక్డౌన్ను కఠినంగా అమలు చేయనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలలో మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇటు ఏలూరు. తాడేపల్లిగూడెంలో పూర్తి లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. అనంతపురంలో కూడా మంగళవారం నుంచి లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాల, మార్కాపురంలలో లాక్డౌన్ కొనసాగిస్తున్నారు.