యాప్నగరం

విశాఖ: ప్రియుడి కిడ్నాప్‌‌కు ప్రియురాలి హైడ్రామా.. నిండు ప్రాణం బలి

వంశీతో ఏర్పడిన పరిచయంతో ఇద్దరూ కొద్దిరోజులు బయటకు వెళ్లిపోయారు. భీమిలి స్టేషన్‌లో దీనిపై కిడ్నాప్ కేసు నమోదైంది. పెద్దల సమక్షంలో వంశీ తండ్రి ఆమెకు రూ.2లక్షలు ఇచ్చి పత్రాలు రాయించుకున్నారు.

Samayam Telugu 11 Nov 2020, 7:57 am
శాఖలో ప్రియుడ్ని కిడ్నాప్‌కు ప్రియురాలు ప్రయత్నించింది. నలుగుర్ని వెంటబెట్టుకొచ్చి ప్రియుడ్ని కిడ్నాప్ చేసే ప్రయత్నంలో ఓ నిండు ప్రాణం బలైంది. తగరపువలస బాలాజీనగర్‌కి చెందిన రౌతు వంశీకృష్ణ తన తండ్రి నిర్వహిస్తున్న చికెన్‌ షాపుకు వెళ్తున్నాడు. అతడు నేషనల్ హైవే అండర్‌పాస్‌ బ్రిడ్జ్ దగ్గరకు రాగానే నలుగురు యువకులతో అక్కడే ఉన్న మహిళ అతడిని కిడ్నాప్‌ యత్నం చేసింది. ఆ పక్కనే ఉన్న వంశీ తండ్రి వెంకటరావు పరిగెత్తుకొచ్చాడు. తన కొడుకు వద్దకు ఎందుకు వచ్చావని ఆ మహిళను నిలదీశాడు.
Samayam Telugu విశాఖలో విషాదం


అండర్ పాస్ దగ్గరే ఇరువురి మధ్య వాగ్వాదం.. తర్వాత పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో వెంకటరావు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. వెంటనే ఆ మహిళ, నలుగురు యువకులు అక్కడ్నుంచి కారులో పరారయ్యారు. మృతుడి భార్య ఫిర్యాదుతో నిందితులపై 304 పార్ట్‌ 2 కింద కేసు నమోదు. అయితే కిడ్నాప్‌నకు ప్రయత్నించిన మహిళది శ్రీకాకుళం.. మహిళ భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి తగరపువలస బాలాజీనగర్‌లో రెండేళ్ల కిందట ఉండేవారు. వంశీతో ఏర్పడిన పరిచయంతో ఇద్దరూ కొద్దిరోజులు బయటకు వెళ్లిపోయారు. భీమిలి స్టేషన్‌లో దీనిపై కిడ్నాప్ కేసు నమోదైంది. పెద్దల సమక్షంలో వంశీ తండ్రి వెంకటరావు ఆమెకు రూ.2లక్షలు ఇచ్చి పత్రాలు రాయించుకున్నారని స్థానికులు, మృతుని భార్య చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.