యాప్నగరం

పవన్ కళ్యాణ్ పేరుతో మోసం.. జనసేన కార్యకర్త అరాచకం

పవన్‌ కళ్యాణ్ ఒంటరి వృద్ధులకు నెలకు పదివేల చొప్పున పింఛన్‌ ఇస్తున్నాడని తనను నమ్మించాడంటోంది. తనకు పింఛన్ వచ్చిందని ఓ రోజు కొన్ని డాక్యుమెంట్లతో తన దగ్గరకు వచ్చాడని.. సంతకాలు చేయించుకున్నాడని చెప్పింది.

Samayam Telugu 25 Jun 2020, 10:27 am
పవన్ కళ్యాణ్ పేరుతో జనసేన పార్టీ కార్యకర్త తనను మోసం చేశారని ఓ వృద్ధురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. పింఛన్ పేరుతో తన దగ్గర సంతకాలు తీసుకుని ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆమె ఆరోపిస్తోంది. విజయవాడ పాయకాపురం సుందరయ్యనగర్ ప్రాంతంలో లక్ష్మి అనే వృద్ధురాలు నివాసం ఉంటోంది. భర్త చనిపోగా.. కుమార్తెకు పెళ్లి చేయగా.. కుమారుడు హైదరారాబాద్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. దీంతో ఆమె ఒక్కరే విజయవాడలో ఉంటున్నారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


సుందరయ్యనగర్‌లో ఉంటున్న జనసేన పార్టీ కార్యకర్త తనకు పరిచయం అయ్యాడని బాధితురాలు చెబుతోంది. పవన్‌ కళ్యాణ్ ఒంటరి వృద్ధులకు నెలకు పదివేల చొప్పున పింఛన్‌ ఇస్తున్నాడని తనను నమ్మించాడంటోంది. తనకు పింఛన్ వచ్చిందని ఓ రోజు కొన్ని డాక్యుమెంట్లతో తన దగ్గరకు వచ్చాడని.. సంతకాలు చేయించుకున్నాడని చెప్పింది. ఆరు నెలల తర్వాత ఆ ఇల్లు తనదేనంటూ బేరం పెట్టాడని తెలిసి నున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. అయితే ఈ ఆరోపణలపై శ్యాంసన్ స్పందించాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.