యాప్నగరం

అనంతపురం: రెండు లారీలు ఢీ.. ఓ డ్రైవర్ సజీవదహనం

అనంతపురంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొనగా.. ఓ లారీ డ్రైవర్ మంటల్లో కాలిబూడిదయ్యాడు.

Samayam Telugu 30 Jun 2020, 11:58 am
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం తాడిపత్రి సమీపంలోని కడప రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో మంటలు చెలరేగి ఓ లారీ డ్రైవర్‌ సజీవదహనమయ్యాడు. తాడిపత్రి నుంచి వరిపొట్టు లోడుతో వెళ్తున్న లారీ, కడప నుంచి బొగ్గు లోడ్‌తో తాడిపత్రి వైపు వస్తున్న మరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. వాహనాలు బలంగా ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బొగ్గు లారీ డ్రైవర్‌ మంటల్లో కాలిపోయాడు. లారీ డ్రైవర్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నిషార్‌‌గా గుర్తించారు.
Samayam Telugu అనంతపురంలో రోడ్డు ప్రమాదం
Anantapur Road Accident


ప్రమాదంలో మరో లారీలోని ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు గంటపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. అనంతరం క్షతగాత్రులను బయటకు తీసి తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను క్రమబద్దీకరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.