యాప్నగరం

విజయవాడలో అర్థరాత్రి కాల్పులు.. యువకుడి మృతి

అర్థరాత్రి దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. నగరంలోని బైపాస్ రోడ్డులోని బార్ సమీపంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. నిందితుల కోసం స్పెషల్ టీం రంగంలోకి దిగాయి.

Samayam Telugu 11 Oct 2020, 9:56 am
విజయవాడ నగర శివారులో తుపాకీ కాల్పుల కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి అగంతకులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందాడు. యువకుడిపై దుండగులు కాల్పుల జరిపి కాల్చి చంపారు. అయితే మృతుడిని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో పనిచేసే మహేష్‌గా గుర్తించారు. కాల్పుల ఘటన విజయవాడ శివారు బైపాస్‌రోడ్డులోని బార్‌ సమీపంలో చోటుచేసుకుంది. నిందితులు పథకం ప్రకారమే మహేష్‌ను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Samayam Telugu విజయవాడలో కాల్పులు
vijayawada firing


Read More: కుప్పం: మట్టిదిబ్బలో బంగారు నాణేలు, ఎగబడ్డ జనం.. భారీగా ట్రాఫిక్ జామ్!

సీపీ బత్తిన శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని అర్ధరాత్రి పరిశీలించారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలో చోటు చేసకున్న ఈ ఘటనతో విజయవాడ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

మహేష్‌ను పాయింట్ బ్లాంక్‌లో దుండుగులు కాల్చి చంపినట్లు గుర్తించారు. మహేష్ గొంతు, ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. మరో బుల్లెట్ పొట్టలోకి దూసుకెళ్లింది. స్థానికులు అతడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మహేష్ మరణించాడు. సీసీ ఫుటేజ్‌ను బెజవాడ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటన వెనుక ఓ మహిళ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.