యాప్నగరం

పవన్ పర్యటనలో అపశృతి: అభిమానికి విరిగిన కాలు.. జనసేనాని పెద్ద మనసుతో

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళుతుండగా..

Samayam Telugu 2 Dec 2020, 1:07 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. పామర్రు మండలంలోని కనుమూరు దగ్గర కారు ర్యాలీలో అపశృతి జరిగింది. రెండు కార్ల మధ్య ఒక బైక్ ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తికి కాలు విరిగిపోయింది. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ కారు దిగారు.. తన కారులో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు పవన్ కళ్యాణ్ సూచించారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్ పర్యటన


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా ఉయ్యూరులో రైతులతో కలిసి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తుఫాన్, భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని.. జనసేనానికి పలువురు అన్నదాతలు నష్టపోయిన పంటలను చూపించారు. తమ కష్టాలను పవన్‌తో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు.

పొలాలకు పెట్టుబడి పెట్టామని.. నివర్ తుఫాన్‌ దెబ్బకు పూర్తిగా నష్ట పోయామన్నారు. పొలాల్లో నీళ్లు అలాగే నిలిచిపోయాయని.. తమకు ప్రభుత్వం నుంచి సాయం అందించలేదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని.. రైతులకు ఆర్థిక సాయం వచ్చేలా కృషి చేస్తాను అన్నారు. పవన్ ఇవాళ, గురువారం, శుక్రవారం నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.