యాప్నగరం

తూ.గో: కచ్చులూరు విషాదానికి ఏడాది.. ఇప్పటికీ ఆ ప్రమాదం ఓ పీడకల

ప్రమాద సమయంలో బోటులో 77 మంది ఉన్నారు. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు చెందిన 51 మంది చనిపోగా.. 26 మందిని స్థానికులు రక్షించారు. బోటును బయటకు తీయడానికి ఎన్డీఆర్‌ఎఫ్, నేవీ, ఫైర్ శాఖలు ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు.

Samayam Telugu 15 Sep 2020, 7:48 am
51మందిని బలి తీసుకున్న తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదం జరిగింది ఏడాది. ఆ చేదు జ్ఞాపకం ఇప్పటికీ బాధిత కుటుంబాలను వెంటాడుతూనే ఉంది. ఈ ప్రమాదంలో కొంతమందికి తమ కుటుంబ సభ్యుల చివరి చూపూ దక్కని పరిస్థితి.. కళ్ల ముందే తమ కుటుంబ సభ్యులు నీళ్లలో కొట్టుకుపోతున్నా కాపాడలేని నిస్సహాయత. ఇలా ఏ కుటుంబాన్ని కదిల్చినా కన్నీటి కథలే వినిపిస్తున్నాయి. ఆ పీడ కలను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాము అంటున్నారు.
Samayam Telugu కచ్చులూరు బోటు ప్రమాదం


2019 సెప్టెంబరు 15న వశిష్ఠ పున్నమి రాయల్‌ బోటు దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో 77 మంది ఉన్నారు. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు చెందిన 51 మంది చనిపోగా.. 26 మందిని స్థానికులు రక్షించారు. బోటులో కొన్ని మృతదేహాలు చిక్కుకుపోయాయి.. కానీ బోటును బయటకు తీయడం కష్టమైంది. అదే సమయంలో గోదావరి నదికి వరద ఎక్కువగా ఉండడంతో 300 అడుగుల లోతున ఉన్న బోటు వెలికితీయడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఎన్డీఆర్‌ఎఫ్, నేవీ, ఫైర్ శాఖలు ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం, తన టీమ్‌తో కలిసి 38 రోజుల తర్వాత బోటును బయటికి లాగారు. గాలింపు క్రమంలో 46 మృతదేహాలు లభ్యంకాగా.. మరో ఐదుగుర్ని గుర్తించలేకపోయారు. ఇక మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షలు, స్వల్పంగా గాయపడిన, గాయాలు లేకుండా బయటపడిన వారికి రూ.లక్ష చొప్పున ఇచ్చారు. తెలంగాణ వారికి అక్కడి ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున అదనంగా అందించింది. కేంద్రం రూ.2 లక్షల ఇచ్చింది.ఈ ప్రమాదంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపింది.. ఓ కమిటీని నియమించింది. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా సూచనలు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.