యాప్నగరం

‘బోటు’ సాక్షిగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం!

ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న బోటు వ్యవహారం ప్రతిపక్షానికి విమర్శనాస్త్రంగా మారింది. శనివారం నుంచి బోటును తొలగించడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం సఫలంకాలేదు.

Samayam Telugu 25 Aug 2019, 1:26 pm
Samayam Telugu Prakasam
ఇటీవల కృష్ణానదికి వచ్చిన వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీ గేట్‌కు మధ్య బోటు చిక్కుకుపోవడంతో నీరు వృథాగా సముద్రంలోకి పోతుంది. చిక్కుకున్న బోటుని తొలగించడానికి శనివారం నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. అధికార యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించడం లేదు. బోటును ఇంతవరకూ అంగుళం కూడా కదిలించలేకపోయారు. ఇది అధికారులకి సవాల్ గా మారింది. బోటును తొలగించడానికి కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాన్ని రప్పించినా ఫలితం లేకపోయింది. బ్యారేజ్‌కి వెనుక ముందు రెండు ప్రొక్లెయినర్లు పెట్టి ఐరన్ రోప్ సాయంతో బోటుకు బయటికి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. జలవనరుల మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్వయంగా బోటు తొలగించే పనులని శనివారం పర్యవేక్షించారు.

బోటుని తొలగించేందుకు అరవై మంది సిబ్బంది అన్నిరకాల ప్రయత్నాలు చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. బోటుని తొలగించే పనుల కోసం బ్యారేజ్ మీదకి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కాగా, బోటు వ్యవహారం అధికార పక్షానికి తలనొప్పిగా మారింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దీనిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతోంది. దీంతో అధికార వైఎస్ఆర్సీపీ దీనిని సవాల్‌గా తీసుకుంది.

Read Also:'అది కూడా చేతకాదా.. టీడీపీకి, వైసీపీకి అదే తేడా'
కాగా, శనివారం ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రమాదవశాత్తూ వరద నీటిలో పడి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. చేపల కోసం చూస్తుండగా.. కాలుజారి వరద నీటిలో కొట్టుకుపోయాడు. కాసేపు ఈత కొట్టేందుకు ప్రయత్నించినా ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సాధ్యపడలేదు. మత్స్యకారులు అతడ్ని ఒడ్డుకు చేర్చి కాపాడే ప్రయత్నం చేసినా ప్రాణాలు దక్కలేదు. ఆ సమయంలో మంత్రి అనిల్ కుమార్ ప్రకాశం బ్యారేజీ వద్దే ఉన్నారు. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్‌లో ప్రభుత్వం విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

Read Also: చిన్న బోటు తీయలేని చేతగాని ప్రభుత్వం.. మంత్రి సాక్షిగా అమాయకుడు బలి: లోకేశ్

ప్రకాశం బ్యారేజి గేటుకి అడ్డంగా ఉన్న చిన్నబోట్ తియ్యలేని చేతగాని ప్రభుత్వం, మంత్రి సాక్షిగా ఒక అమాయకుడి ప్రాణాన్ని మింగేసిందని దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి మరీ ఇంత చులకనేంటి? అని ఆయన ప్రశ్నించిన లోకేశ్.. గేట్లు తెరిచే ముందు కనీస హెచ్చరికలు చేయాలని తెలీదా? ఏంటీ అహంకారం? మంత్రి సమక్షంలోనే ఇలా జరగడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.