యాప్నగరం

వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిని కత్తులతో నరికిన ప్రత్యర్థులు

స్థానిక సంస్థల ఎన్నికల వేళ కడప జిల్లాలో మళ్లీ హింస చెలరేగింది. వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై ప్రత్యర్థులు కత్తులు, కర్రలతో దాడులకు తెగబడ్డారు.

Samayam Telugu 11 Mar 2020, 12:14 am
వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లెలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిపై ప్రత్యర్థులు కత్తులతో దాడికి దిగారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాద్‌పై ప్రత్యర్థులు కత్తులు, కర్రలతో మంగళవారం రాత్రి దాడికి దిగారు. వరప్రసాద్ పని మీద తిప్పిరెడ్డిపల్లె వెళ్తుండగా ఈ దాడి జరిగింది.
Samayam Telugu gang war


వెంటనే స్థానికులు బాధితుడిని ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి మొదలైన విషయం తెలిసిందే. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఒకరిపై మరొకరు దాడులు ప్రతి దాడులు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నామినేషన్లు వేసేందుకు వెళ్లిన పలువురు అభ్యర్థులపై ప్రత్యర్థులు దాడులకు దిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా, కడప జిల్లాలో కత్తులతో దాడులకు దిగడం కలకలం రేపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.