యాప్నగరం

ఏపీలో మహిళలకు జగన్ సర్కార్ మరో వరం.. అదిరిపోయే లాభాలు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 4.90 లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఈ నిధులను జాతీయ కో–ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి 80 శాతం రుణంగా తీసుకునేందుకు ఆమోదం తెలిపింది.

Samayam Telugu 19 Nov 2020, 8:13 am
ఏపీలో మహిళలకు చేయూత ఇస్తోంది జగన్ సర్కార్. రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి చెందిన లక్షలాది మహిళలకు వైఎస్సార్‌ చేయూత అండతో పాడి పశువుల ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే చేయూత మహిళల దగ్గర ఉన్న పాడి పశువుల ద్వారా ఉత్పత్తి అయ్యే పాలను అమూల్‌ ద్వారా సేకరించి, సరైన ధర కల్పించడంతో పాటు పాడి పశువుల్లేని చేయూత మహిళలకు వాటిని కొనుగోలు చేసి పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.
Samayam Telugu సీఎం జగన్


Read Also: ఏపీలో మరో ఎయిర్‌పోర్ట్.. ఆ జిల్లాకు గుడ్‌న్యూస్, వివరాలివే

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 4.90 లక్షల మంది మహిళలు పాడి పశువుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే పాడి పశువులు ఉన్న వారు 72,795 మంది మరికొన్నింటి కోసం దరఖాస్తు చేశారు. దీంతో ప్రభుత్వం మొత్తం 5.63 లక్షల పాడి పశువులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న 9,899 రైతు భరోసా కేంద్రాలున్న గ్రామాలను గుర్తించి, వీటికి అనుబంధంగా బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాలను మూడు దశల్లో నిర్మాణం చేయనుంది. మూడు దశల్లో రూ.1,362.22 కోట్ల వ్యయంతో 7,125 ఆటోమేటిక్‌ పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Also Read: ఏపీ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. 1,750 స్పెషల్ బస్సులు

ప్రభుత్వం ఈ నిధులను జాతీయ కో–ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి 80 శాతం రుణంగా తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. మిగతా 20 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఐదు సెంట్ల విస్తీర్ణంలో ఒక్కో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌ను రూ.11 లక్షల వ్యయంతో, ఒక్కో పాల సేకరణ కేంద్రాన్ని రూ.4 లక్షలతో నిర్మించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు పశువుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.