యాప్నగరం

పీఏసీ చైర్మన్ పయ్యావులకు అస్వస్థత.. విజయవాడ తరలింపు

చంద్రబాబు సన్నిహితుడు.. టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అస్వస్థత. పీఏసీ చైర్మన్‌గా ఉన్న కేశవ్. అమరావతిలో పీఏసీ సమావేశం జరుగుతుండగా అస్వస్థతకు గురికావడంతో విజయవాడ తరలింపు.

Samayam Telugu 7 Nov 2019, 4:15 pm
పీఏసీ చైర్మన్, అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలో జరుగుతున్న పీఏసీ భేటీ జరుగుతున్న సమయంలో ఉండగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం. సమావేశం మధ్యలో వాంతులు కావడంతో వెంటనే అసెంబ్లీ డిస్పెన్సరీలో చికిత్స అందజేశారు. స్వల్ప అస్వస్థతేనని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అనంతరం ఆయనను విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu PAYYAVULA KESHAV_0


Also Read: తిరుపతిలో ఘోరం.. ఉద్యోగినితో బలవంతంగా మద్యం తాగించి..

తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పీఏసీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం క్యాబినెట్ హోదా కలిగిన పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఎమ్మెల్యే అయిన పయ్యావులను పీఏసీ చైర్మన్ పదవి వరించింది. 2019 ఎన్నికల్లో ఉరవకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే.. వైఎస్సార్సీపీ నేత విశ్వేశ్వర రెడ్డిపై ఆయన విజయం సాధించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.