యాప్నగరం

YSRCP రాజ్యసభ సీటుపై నత్వానీ ఆసక్తికర ట్వీట్.. మోదీ, అమిత్ షాలకూ..

ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన పరిమల్ నత్వానీ ఆసక్తికర ట్వీట్ చేశారు. తనను రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Samayam Telugu 9 Mar 2020, 7:30 pm
తనకు రాజ్యసభ సీటు కేటాయించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సన్నిహితుడు, ఎంపీ పరిమల్ నత్వానీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆయన ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్‌లో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu pjimage (85)


Also Read: ‘ఆ విషయంలో జగన్‌కు అంబానీ హామీ.. అందుకే రాజ్యసభ సీటు’

‘ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన పార్టీ వైఎస్సార్‌సీపీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తాను’ అని నత్వానీ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌ను ప్రధాని కార్యాలయం, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాకు జోడించారు.

వాస్తవానికి నత్వానీకి సీటు కేటాయించాలంటూ ఆయనను వెంటబెట్టుకుని పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఏపీకి వచ్చి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. అయితే నత్వానీ తన ట్వీట్‌లో అంబానీని ప్రస్తావించకుండా.. ప్రధాని మోదీ, అమిత్ షాలను ట్యాగ్ చేశారు. దీంతో నత్వానీకి ఏపీ నుంచి రాజ్యసభ సీటు రావడం వెనుక బీజేపీ అగ్ర నేతలు ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.