యాప్నగరం

టీడీపీ నుంచి మరో వికెట్ అవుట్.. వైసీపీలోకి చంద్రబాబు సన్నిహితుడు!

ప్రకాశం జిల్లాలో టీడీపీకి మరో ఎదురు దెబ్బ.. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు పార్టీ మారతారని జోరుగా ప్రచారం. శనివారం జగన్‌ను కలిసి వైఎస్సార్‌సీపీలో చేరే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు.

Samayam Telugu 13 Mar 2020, 12:14 pm
స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. నేతలు ఒక్కొక్కరిగా తెలుగు దేశం పార్టీని వీడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో మరో నేత పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి, సీనియర్ నేత శిద్దా రాఘవరావు కూడా వైఎస్సార్‌సీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆయన కూడా వైఎస్సార్‌సీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని.. శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో కండువా కప్పుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Samayam Telugu cbn.

Read Also: టీడీపీకి మరో ఎదురు దెబ్బ.. వైసీపీలోకి సీనియర్ ఎమ్మెల్సీ

శిద్దా రాఘవరావు టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు.. చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటారు. 2004లో ఆయన టీడీపీ తరపున ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత నియోజకవర్గం మారి.. 2014లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో మళ్లీ దర్శి నుంచి బరిలోకి దిగాలని భావించారు. కానీ జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలతో దర్శిని వదిలేసి ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.

ఇప్పటికే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కదిరిబాబూరావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా వైఎస్సార్‌సీపీకి జైకొట్టిన సంగతి తెలిసిందే. బలరాం పార్టీలో చేరకపోయినా.. మద్దతు తెలిపారు. తన కుమారుడితో పాటూ మాజీ మంత్రి పాలేటి రామారావుు, ఇతర నేతలు మాత్రం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. తాజాగా శిద్దా కూడా పార్టీ వీడతారనే ప్రచారం ఆసక్తికరంగా మారింది.. ఆయన కూడా తెలుగు దేశాన్ని వీడితే.. ప్రకాశం జిల్లాలో ఎదురు దెబ్బ తగిలినట్లే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.