యాప్నగరం

YSRCPలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే.. నేడు సీఎం జగన్‌తో భేటీ!

కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.. వైఎస్సార్‌సీపీ పెద్దలతో ఆయన టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. శనివారం ఆయన ముఖ్యమంత్రి జగన్‌ను కలవనున్నారు.

Samayam Telugu 19 Sep 2020, 8:30 am
ఏపీలో టీడీపీకి కష్టాలు కొనసాగుతున్నాయి.. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పగా.. తాజాగా మరో ఎమ్మెల్యే గోడ దూకేందుకు సిద్ధమయ్యారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శనివారం ఆయన ముఖ్యమంత్రి జగన్‌ను కలవనున్నారు. కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.. వైఎస్సార్‌సీపీ పెద్దలతో ఆయన టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. గణేష్ వైఎస్సార్‌సీపీలో చేరకుండా ఆ పార్టీకి మద్దతుగా ఉంటారు. అంటే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి బాటలోనే నడవనున్నారు. పార్టీ మారడంపై ఆయన ఇంకా స్పందించలేదు.
Samayam Telugu టీడీపీ


Read Also: వైసీపీ ఎమ్మెల్యేపై కేసు పెట్టాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు

టీడీపీ నుంచి గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరిలు కూడా ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. వైఎస్సార్‌సీపీలో చేరకపోయినప్పటికి మద్దతు తెలిపారు. నియోజకవర్గాల్లో కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఒకవేళ టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరైనా అధికారపార్టీలోకి వెళితే ఇదే దారిలోనే నడవనున్నారు.

Also Read: ఏపీలో రోడ్డెక్కిన బస్సులు.. త్వరలోనే అక్కడ కూడా!

వాసుపల్లి గణేష్ 2009 ఎన్నికల్లో విశాఖ దక్షిణం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2014లో విజయం సాధించారు.. 2019లో మళ్లీ గెలిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.