యాప్నగరం

Pawan Kalyan స్పెషల్ రిక్వెస్ట్.. పాటించాల్సిందే, వేరే దారే లేదు

India Lockdown: ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 21 రోజుల లాక్ డౌన్‌ను ప్రజలందరూ విధిగా పాటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Samayam Telugu 24 Mar 2020, 9:41 pm
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు 21 రోజుల లాక్ డౌన్‌ను అందరూ విధిగా పాటించాలని కోరారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినవి విధిగా పాటించి తీరాలని, వేరే దారి లేదని స్పష్టం చేశారు.
Samayam Telugu pawan 2


దయచేసి అందరూ ఇళ్లలోనే ఉండాలని పవన్ విజ్ఞప్తి చేశారు. ఈ 21 రోజుల పాటు ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. ప్రాణాల మీదకు ఏమైనా సమస్య వస్తే ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేసి వారి సలహాలు సూచనలు పాటించాలని కోరారు. దీన్ని ప్రతిఒక్కరూ విధిగా పాటించాలని అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతోన్న నేపథ్యంలో మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ 21 రోజులపాటు దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ మూడు వారాలను మీ జీవితంలో మర్చిపోండని దేశ ప్రజలను ఆయన కోరారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి అని ప్రధాని మోదీ తెలిపారు. మీ ఇళ్ల ముందు లక్ష్మణ రేఖ ఉందన్న ప్రధాని మోదీ గడప దాటి బయటకు రావొద్దని పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.