యాప్నగరం

YS Jagan మొండోడు, నాకేటి సిగ్గు రీతిలో పాలన.. పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు

Nimmagadda Ramesh Kumar: ఎస్ఈసీ రమేష్ కుమార్ పదవీకాలం ముగిసేలా వైసీపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Samayam Telugu 10 Apr 2020, 9:49 pm
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపునకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కక్ష సాధింపు, మొండి వైఖరి, ఏకపక్ష నిర్ణయాలతో జగన్‌రెడ్డి ప్రభుత్వం మరోసారి వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషనర్‌గా రమేష్ కుమార్‌ను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వు ద్వారా తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలియజేశారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu pjimage - 2020-04-10T201813.814


ముఖ్యమైన విషయాల్లో జగన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉంటున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. వీటన్నింటిలో హైకోర్టుతో చీవాట్లు పెట్టించుకున్నా ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’’ అన్న సామెతలా ఈ ప్రభుత్వ వ్యవహారం సాగుతోందని విమర్శించారు.

ఓవైపు కరోనా వైరస్‌తో ప్రజలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటే, ప్రభుత్వం తన శక్తి సామర్థ్యాలను జనాలను కాపాడటంపై కేంద్రీకరించాలని గాని, ఇందుకు భిన్నంగా ప్రభుత్వంలోని పెద్దలు కక్ష తీర్చుకోవడంలో మునిగిపోయారని దుయ్యబట్టారు. ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.