యాప్నగరం

ఇది చీకటి జీవోల సర్కార్.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: కర్నూలుకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ వైసీపీ సర్కారు జీవో జారీ చేయడంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ విమర్శించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన ట్వీట్ చేశారు.

Samayam Telugu 3 Feb 2020, 11:06 pm
అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ వైసీపీ సర్కారు జీవో జారీ చేయడంపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌, రాష్ట్ర విజిలెన్స్‌ కమిషనర్‌ కార్యాలయాలను తరలిస్తూ జీవో నంబర్‌ 13ను అర్ధరాత్రి వేళ జారీ చేయడం తనను నమ్మి 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిపించిన ప్రజలను మోసం చేయడానికా అని ప్రశ్నించారు. లేక రాజధాని తరలింపుపై కేసులు విచారణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కళ్లుగప్పడానికా అని నిలదీశారు. ఇటువంటి చర్యల వల్ల చివరికి బలైపోయేది దానిపై సంతకాలు చేసే ఉద్యోగులేనని చెప్పారు.
Samayam Telugu Pawan Kalyan


Also Read: సినిమాల్లోకి పవన్‌ రీఎంట్రీ.. పెరుగుతున్న రాజకీయ మద్దతు

అయినా రాష్ట్ర సచివాలయం ఆధ్వర్యంలో పని చేయాల్సిన రాష్ట్ర విజిలెన్స్‌ ‌కమిషనర్‌ కార్యాలయాన్ని కర్నూలుకు ఎందుకు తరలిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కనీసం ఆ విషయం అందులో పనిచేసే వారికీ అర్థం కాకుండా ఉందని విమర్శించారు. ఇలా తరలించడం వల్ల తాము కోర్టు కేసుల్లో ఎక్కడ ఇరుక్కుంటామోనని భయపడుతూ రాష్ట్రంలో అత్యున్నత స్థాయి అధికారి సెలవు పెట్టేద్దామన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తోందన్నారు. దీన్ని బట్లే వారు ఎంత అభద్రతా భావంలో ఉన్నారో అర్థమవుతోందన్నారు.

Also Read: జేడీ, రాపాకపై జనసేనాని అదిరిపోయే పంచ్‌లు.. వాళ్లకు కాపలా కాయను!

జీవో నంబర్ 13 విడుదలైనప్పుడే ఇది రాజధాని తరలింపుపై దాఖలైన కేసుల పరిధిలోకి వస్తుందని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారని తెలిపారు. వారు అనుకున్న విధంగానే ఈ జీవో హైకోర్టు ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. ఇకనైనా వైసీపీ ప్రభుత్వం దొడ్డిదారి జీవోలు ఆపడం సర్వత్రా శ్రేయస్కరమని హితవు పలికారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.