యాప్నగరం

AP Capital: రాజధాని అమరావతే.. అనుమానాల్లేవ్‌: పవన్ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అమరావతే ఆంధ్రుల శాశ్వత రాజధానిగా కొనసాగుతుందని మాటిస్తున్నట్లు పవన్ వ్యాఖ్యానించారు.

Samayam Telugu 22 Jan 2020, 5:49 pm
ఆంధ్రుల శాశ్వత రాజధానిగా అమరావతే కొనసాగుతుందని మాటిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాజధాని మార్పు అంత సులువైన విషయం కాదన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్.. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోదర్ తదితరులతో కలిసి కేంద్ర మంత్రిని కలిశారు.
Samayam Telugu pawan


అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రితో రాజకీయ, ఆర్థిక అంశాలతో పాటు అమరావతిపై కూడా చర్చించినట్లు చెప్పారు. అమరావతే శాశ్వత రాజధానిగా ఉండేందుకు కలిసి పని చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెప్పే మూడు రాజధానులు చేస్తున్నట్లు వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, అయితే అందులో వాస్తవం లేదన్నారు. ఇప్పుడు తాను కేంద్రాన్ని కలిసే చెప్తున్నానని, మూడు రాజధానులకు కేంద్రం సమ్మతం లేదని వెల్లడించారు.

కేంద్రాన్ని భ్రష్టుపట్టించేందుకు వైసీపీ నాయకులు ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిలో దాడుల గురించి కూడా చర్చించామని, దీనిపై త్వరలోనే బీజేపీతో కలిసి బలమైన కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని 5 కోట్ల మంది ఆంధ్రులకు, రైతులకు మాటిస్తున్నానని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.