కాపు రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి స్పష్టతనివ్వాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఎలాంటి మొహమాటం లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వమని తేల్చిచెప్పారన్నారు. అయినా ఆయనకు ఓట్లేసి గెలిపించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మరోసారి అదే మాట చెప్పాలని కోరారు. జనసైనికుల కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దీన్ని కొన్ని భాగాలుగా చేసి విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఇంటర్వ్యూ రెండో భాగాన్ని విడుదల చేశారు.
Must Read: ఏపీలో కరోనా ప్రకంపనలు: ఒక్క రోజే 8,147 కేసులు.. భారీగా మరణాలు.. ఆ ఒక్క జిల్లాలో 11 వేలు..
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మరోసారి కాపులకు రిజర్వేషన్ల ఇవ్వడం లేదని సీఎం జగన్ చెబుతే అందరికీ స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రసీపీ ప్రభుత్వం గానీ, ప్రజాప్రతినిధులు గానీ కాపు రిజర్వేషన్లకు సంబంధించి మరోసారి స్పష్టం చేస్తే బాగుంటుందన్నారు. అలాగే కాపు కార్పొరేషన్, ఇతర కార్పొరేషన్ల ఫండ్ల మీద శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందన్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారన్నారు. ఆ పార్టీకి ఉన్న బలాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం, కొన్ని వర్గాలకే పని చేసి, ఓట్ బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సిఎం జగన్ సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకుంటే సుమారు 60 కేసుల్లో ఓడిపోయిందని, ఆ తప్పులను సరిచేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకు సరైన జీవన విదానం ఇవ్వాలన్నారు.
Must Read: కరోనా చికిత్స కోసం అదనంగా రూ. వెయ్యి కోట్లు.. సీఎం జగన్ కీలక నిర్ణయం
గత ప్రభుత్వంలో ఉన్న తప్పులను ఈ ప్రభుత్వం సరిచేసే అవకాశం ఉన్నా.. సద్వినియోగం చేసుకోవడంలేదని పవన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు చూడకుండా అప్పులు తెచ్చే మార్గాలు చూస్తోందన్నారు. దీనివల్ల ప్రభుత్వం నడిపే వ్యక్తులకు ఏంకాదన్నారు. అప్పులు తెచ్చి పరిపాలన చేస్తే అది అభివృద్దికాదని, తిరోగమనమవుతోందని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, ఇంకా నాలుగేళ్ల సమయం ఉందని ఇకనైనా వైసీపీ నేతలు అభివృద్ధి పథం వైపు వెళ్లాలని కోరుకుంటున్నట్లు వపన్ వ్యాఖ్యానించారు.
Also Read: విజయవాడలో పట్టపగలే భారీ దోపిడీ.. 7 కేజీల బంగారం, రూ. లక్షల డబ్బుతో..
Must Read: ఏపీలో కరోనా ప్రకంపనలు: ఒక్క రోజే 8,147 కేసులు.. భారీగా మరణాలు.. ఆ ఒక్క జిల్లాలో 11 వేలు..
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మరోసారి కాపులకు రిజర్వేషన్ల ఇవ్వడం లేదని సీఎం జగన్ చెబుతే అందరికీ స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రసీపీ ప్రభుత్వం గానీ, ప్రజాప్రతినిధులు గానీ కాపు రిజర్వేషన్లకు సంబంధించి మరోసారి స్పష్టం చేస్తే బాగుంటుందన్నారు. అలాగే కాపు కార్పొరేషన్, ఇతర కార్పొరేషన్ల ఫండ్ల మీద శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందన్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారన్నారు. ఆ పార్టీకి ఉన్న బలాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం, కొన్ని వర్గాలకే పని చేసి, ఓట్ బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సిఎం జగన్ సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకుంటే సుమారు 60 కేసుల్లో ఓడిపోయిందని, ఆ తప్పులను సరిచేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకు సరైన జీవన విదానం ఇవ్వాలన్నారు.
Must Read: కరోనా చికిత్స కోసం అదనంగా రూ. వెయ్యి కోట్లు.. సీఎం జగన్ కీలక నిర్ణయం
గత ప్రభుత్వంలో ఉన్న తప్పులను ఈ ప్రభుత్వం సరిచేసే అవకాశం ఉన్నా.. సద్వినియోగం చేసుకోవడంలేదని పవన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు చూడకుండా అప్పులు తెచ్చే మార్గాలు చూస్తోందన్నారు. దీనివల్ల ప్రభుత్వం నడిపే వ్యక్తులకు ఏంకాదన్నారు. అప్పులు తెచ్చి పరిపాలన చేస్తే అది అభివృద్దికాదని, తిరోగమనమవుతోందని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, ఇంకా నాలుగేళ్ల సమయం ఉందని ఇకనైనా వైసీపీ నేతలు అభివృద్ధి పథం వైపు వెళ్లాలని కోరుకుంటున్నట్లు వపన్ వ్యాఖ్యానించారు.
Also Read: విజయవాడలో పట్టపగలే భారీ దోపిడీ.. 7 కేజీల బంగారం, రూ. లక్షల డబ్బుతో..