యాప్నగరం

సరికొత్త కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం.. కరోనాపై ఆసక్తికర వ్యాఖ్యలు

Janasena: రాజమండ్రిలోని గోదావరి నది ఒడ్డును శనివారం సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన నుడి - మన నది కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Samayam Telugu 14 Mar 2020, 10:13 pm
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించిన పవన్.. సాయంత్రం ధవళేశ్వరంలోని రామ పాదాల రేవు వద్దకు చేరుకుని గోదావరి నదికి హారతి ఇచ్చారు. అనంతరం ‘మన నుడి - మన నది’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ధవళేశ్వరం వద్ద కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు.
Samayam Telugu pawan


అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మనకు జీవమిచ్చే జలాలకు.. జీవనాన్ని ఇచ్చిన నుడికి గౌరవం తెలిపేందుకే ‘మన నది- మన నుడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. అంతరించిపోతున్న విలువలను కాపాడుకోవడానికి, కాలుష్యకాషారంగా మారుతున్న నదులను పరిరక్షించుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. గురువుకు నమస్కరించి ఎలాంటి కార్యక్రమం చేపట్టినా అది విజయవంతమవుతుందని, ఇరోజు తన గురువు స్థానంలో ఉన్న సుబ్బరాయుడు శర్మ పాదాలకు నమస్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ప్రకృతి ప్రకోపిస్తే ప్రంచాన్ని శాసించే గొప్ప నాయకులను కూడా ఇంట్లో కూర్చోపెడుతుంద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇవాళ కరోనా వైరస్ కూడా ప్రపంచాన్ని వణికించే నాయకులను సైతం ఇంట్లోనే కూర్చోబెట్టిందని చెప్పుకొచ్చారు. అందుకే ప్రకృతిని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని సూచించారు. నదులు, భాషను పరిరక్షించుకోవడానికి ఎవరి స్థాయిలో వారు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ‘మన నుడి - మన నది’ వెబ్‌సైట్‌ను సైతం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.