యాప్నగరం

ఆ ముగ్గురు కేబినెట్‌లోకి వెళ్లాక ఏడు ఖాళీలు.. వెంటనే భర్తీ చేయాలని స్పీకర్ తమ్మినేనికి పయ్యావుల లేఖ

Payyavula Keshav ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికి లేఖ రాశారు. పీఏసీలో ఏడు ఖాళీలు ఉన్నాయని.. వెంటనే భర్తీ చేయాలని కోరారు. ముగ్గురు కేబినెట్‌లోకి వెళ్లడం.. మరో ఇద్దరికి కీలక పదవులు దక్కడంతో మరో రెండు ఖాళీలతో కలిపి ఏడుగుర్ని భర్తీ చేయాలని లేఖలో ప్రస్తావించారు. ఇటీవలే ఎమ్మెల్సీలు పదవీ విరమణ.. మరో ముగ్గురు మేరుగు నాగార్జున, ఉషశ్రీ చరణ్, జోగి రమేష్ కేబినెట్‌లోకి వెళ్లారు. కోలగట్ల డిప్యూటీ స్పీకర్‌‌గా.. ధర్మశ్రీ విప్‌గా వెళ్లారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 22 Mar 2023, 7:47 am

ప్రధానాంశాలు:

  • స్పీకర్ తమ్మినేనికి పయ్యావుల లేఖ రాశారు
  • పీఏసీలో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు
  • మొత్తం ఏడు ఖాళీలు ఉన్నాయని ప్రస్తావన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Payyavula Keshav
పీఏసీ (ప్రజాపద్దుల కమిటీ)లో ఖాళీలపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికి సీతారామ్‌కు ఆ కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ లేఖ రాశారు. ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఛైర్మన్‌ సహా 12మంది సభ్యులతో పీఏసీ ఏర్పాటైన విషయాన్ని గుర్తు చేశారు. మొత్తం తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉండేవారని గుర్తు చేశారు. వారిలో కొందరు మంత్రులు, డిప్యూటీ స్పీకర్‌, విప్‌గా నియమితులైన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్సీల్లో కొందరు సభ్యులు పదవీవిరమణ చేశారన్నారు.
అందుకే పీఏసీలో శాసనసభ నుంచి 5, మండలి నుంచి 2 ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. కమిటీ పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయటానికి ఆటంకం ఏర్పడుతోందని.. ఆ ఖాళీలు భర్తీ చేయాలని కోరుతూ గతేడాది అక్టోబరు 21న అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశాను అన్నారు. అయినా చేయలేదు.. ఇప్పటికైనా ఆ ఖాళీలను భర్తీచేస్తే పూర్తిస్థాయి కమిటీ కార్యకలాపాలను నిర్వహించగలదు అని లేఖలో ప్రస్తావించారు పయ్యావుల కేశవ్.

పీఏసీలో సభ్యులుగా ఉన్న మేరుగు నాగార్జున, జోగి రమేష్, ఉషశ్రీ చరణ్ మంత్రులుగా కేబినెట్‌లోకి వెళ్లారు. ఇక కోలగట్ల వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్‌గా.. కరణం ధర్మ శ్రీ ప్రభుత్వ విప్‌ అయ్యారు. వీరితో పాటూ మరో రెండు ఖాళీలు ఉన్నాయని లేఖలో ప్రస్తావించారు. ఈ ఏడు ఖాళీలను భర్తీ చేయాలని లేఖలో స్పీకర్ తమ్మినేనిని కోరారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల.

Read Latest Andhra Pradesh News and Telugu News
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.