యాప్నగరం

వైఎస్ విజయమ్మపై ఏపీ నేత ఘాటు వ్యాఖ్యలు.. అంత మాట అనేశారే.!

ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ నేత. విజయమ్మ గారి చర్యలతోనే వైఎస్సార్ ఆత్మ క్షోభిస్తోందంటూ తీవ్ర విమర్శలు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

Samayam Telugu 8 Jul 2021, 10:55 pm
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కొత్త రాజకీయ పరిణామాలకు వేదికైంది. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌టీపీ)ని ప్రారంభిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. కూతురు షర్మిలకు తల్లి వైఎస్ విజయమ్మ మద్దతుగా నిలిచారు. ఈరోజు ఉదయం ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ, షర్మిల హైదరాబాద్ చేరుకుని పార్టీ ఆవిర్భావ సభకు విచ్చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
vijayamma


అయితే సభలో కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబాన్ని రోడ్డున పడేసిందంటూ వైఎస్ విజయమ్మ చేసిన వ్యాఖ్యలు కాకపుట్టిస్తున్నాయి. ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ విజయమ్మ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. విజయమ్మ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్ పేరును అమ్ముకోవడం మానుకోండి విజయమ్మ గారు.. మీ బిడ్డల గురించి మార్కెటింగ్ మానుకోండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మీ కుటుంబ సభ్యులే ద్రోహం చేశారంటూ ఎదురుదాడికి దిగారు. విజయమ్మ చర్యలతో వైఎస్సార్ ఆత్మ క్షోభిస్తుందంటూ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత నేరుగా విజయమ్మని టార్గెట్ చేయడం కలకలం రేపుతోంది.

Also Read: ఉదయం షర్మిల, సాయంత్రం జగన్.. ఎదురుపడని అన్నాచెల్లెళ్లు.. కారణమదేనా?
Read Also:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.