యాప్నగరం

జగన్‌పై పీపుల్స్ స్టార్ ప్రశంసలు.. విషయమేంటంటే?

దేశంలో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం గాడి తప్పింది. రాజకీయాలు డబ్బుతో ప్రభావితమయ్యాయి. ఎవరైనా వైఎస్సార్సీపీలో చేరాలనుకుంటే తప్పకుండా పదవులకు రాజీనామా చేసి రావాలనడం నిజంగా గొప్ప విషయమని సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు.

Samayam Telugu 1 Oct 2019, 7:13 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించారు పీపుల్స్ స్టార్, ప్రజా ఉద్యమకారుడు ఆర్.నారాయణమూర్తి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేయడం అభినందనీయమన్నారు. ఒక పార్టీ అధినేతగా జగన్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం.. డబ్బుకు బలి అవుతున్న రాజకీయం’ అంశంపై నారాయణమూర్తి మాట్లాడారు.
Samayam Telugu pjimage (75)


ఎవరైనా వైఎస్సార్సీపీలో చేరాలనుకుంటే తప్పకుండా పదవులకు రాజీనామా చేసి రావాలనడం నిజంగా గొప్ప విషయమని, అందుకు ఆయనను అభినందిస్తున్నానన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు డబ్బుతో ప్రభావితమయ్యాయన్నారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని పాలకుల తీరుపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

Read Also: కేసీఆర్‌‌, జగన్‌వి ‘మందు బాటిల్’ చర్చలే.. టీడీపీ నేత ఘాటు విమర్శలు

ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా ఉండే నారాయణమూర్తి జగన్‌ను అభినందించడం ఆసక్తి రేపుతోంది. ఆయన ఇటీవల సీఎం జగన్‌ని కూడా కలిశారు. నీటి సమస్యను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. తాండవ జలాశయానికి అదనపు జలాలు సమకూర్చేందుకు.. విశాఖ జిల్లా చిన గొలుగొండపేట దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని సీఎంకు విన్నవించారు. పైపులైన్ ద్వారా రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను అందించాలని విజ్ఞ‌ప్తి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.