యాప్నగరం

రేషన్ కార్డులు.. ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ మరో శుభవార్త

ఐదు రోజుల్లో దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించి రేషన్ కార్డులు అందజేస్తామని కోన శశిధర్ చెప్పారు. ఈ నెల 6 నుంచి కొత్త దరఖాస్తులకు రేషన్‌కార్డులు జారీ చేయనున్నారు.

Samayam Telugu 4 Jun 2020, 12:08 pm
ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుల జారీని మరింత సులభతరం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పకడ్బందీగా రేషన్‌ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని పౌర సరఫరాల ఎక్స్‌అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఐదు రోజుల్లో దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించి రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పారు. ఈ నెల 6 నుంచి కొత్త దరఖాస్తులకు రేషన్‌కార్డులు జారీ చేయనున్నారు.
Samayam Telugu సీఎం జగన్


రేషన్ డోర్ డెలివరీలో భాగంగా కార్డుదారులకు బియ్యం సంచుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీధర్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతీ కుటుంబానికి 10, 15 కిలోల చొప్పున సంచులను అందిస్తామన్నారు. ఒక్కో సంచీ తయారీకి రూ.25 ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ సంచుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిశీలించిన సంగతి తెలిసిందే.. అంతకాదు బియ్యాన్ని ప్రత్యేక వాహనాల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇకపై రేషన్‌ను వాలంటీర్ల ద్వారా ఇంటికే హోం డెలివరీ చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.