యాప్నగరం

జగన్ సర్కార్ విశాఖకు రాజధానిని తరలిస్తోంది.. ఏపీ హైకోర్టులో పిటిషన్

రాజధానిని తరలించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు హైకోర్టులో అత్యవసర పిల్‌ దాఖలు చేశారు. విశాఖకు రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని.. సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికే సూచనలు వెళ్లాయని పిటిషన్‌లో ప్రస్తావించారు.

Samayam Telugu 22 Apr 2020, 10:10 am
విశాఖకు రాజధాని తరలింపు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. రాజధాని తరలిపోకుండా అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధానిని తరలించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు హైకోర్టులో అత్యవసర పిల్‌ దాఖలు చేశారు. విశాఖకు రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని.. సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికే సూచనలు వెళ్లాయని పిటిషన్‌లో ప్రస్తావించారు.
Samayam Telugu capital


రాజధాని తరలింపుపై ప్రభుత్వం అంతర్గతంగా చర్యలు చేపట్టిందని పిటిషనర్ చెప్పుకొచ్చారు. అమరావతిలో సువిశాల రాజధాని ఉందని.. ఇప్పుడు మరో ప్రాంతానికి తరలించడం వల్ల రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడుతుందన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సచివాలయాన్ని విశాఖ తరలించకుండా అడ్డుకోవాలని.. ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

అమరావతి ప్రాంతంలో రాజధానికి సంబంధించి రూ.52,837 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఆ నిర్మాణాలను నిలిపేయకుండా చూడాలని.. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పిటిషన్‌లో కేంద్ర హోంశాఖ కా ర్యదర్శి, నీతి ఆయోగ్‌ కార్యదర్శి, రాష్ట్ర ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సీఎం జగన్‌ని ప్రతివాదులుగా ప్రస్తావించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.