యాప్నగరం

ఏపీలో పెట్రోల్ బంకులు బంద్

Janata Curfew కు మద్దుతుగా ఏపీలో పెట్రోల్ బంకులు మూసివేస్తున్నట్లు ఏపీఎఫ్‌పీటీ ప్రకటించింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మూసివేస్తున్నట్లు తెలిపింది.

Samayam Telugu 21 Mar 2020, 7:58 pm
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ట్రేడర్స్‌ (ఏపీఎఫ్‌పీటీ) మద్దతు ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం కోసం ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించనున్న విషయం తెలిసిందే. దీనికి సంఘీభావంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 3,000 పెట్రోల్‌ బంకులను మూసివేస్తున్నట్లు ఏపీఎఫ్‌పీటీ అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ ప్రకటించారు.
Samayam Telugu petrol pump


అలాగే పెట్రోల్ బంకుల్లో పని చేసే సిబ్బందికి సెలవులు ప్రకటించినట్లు గోపాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వ వాహనాలు, అంబులెన్స్‌ల కోసం ప్రతి పెట్రోల్‌ బంక్‌లో ఒకరిద్దరు సిబ్బందిని ఉంచుతున్నట్లు వివరించారు. కాగా, రాష్ట్రంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించిన విషయం తెలిసిందే. జనతా కర్ఫ్యూలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు శనివారం అర్ధరాత్రి నుంచే నిలిపివేయనున్నట్లు చెప్పారు. దీనికి ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు మంత్రి. ఆదివారం రాత్రి 9 గంటల వరకు బస్సులు నిలిపివేస్తున్నట్లు వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.