యాప్నగరం

ఏపీ: మంత్రి పదవులకు బోస్, మోపిదేవి రాజీనామా

ఎమ్మెల్సీ రాజీనామా లేఖను మండలి ఛైర్మన్‌కు.. మంత్రి పదవులకు రాజీనామా లేఖల్ని సీఎం జగన్‌కు సమర్పించారు. మంత్రి పదవుల రాజీనామా విషయంలో ఇద్దరూ సీఎం ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు.

Samayam Telugu 1 Jul 2020, 3:42 pm
పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ రాజీనామా లేఖను మండలి ఛైర్మన్‌కు.. మంత్రి పదవులకు రాజీనామా లేఖల్ని సీఎం జగన్‌కు సమర్పించారు. మంత్రి పదవుల రాజీనామా విషయంలో ఇద్దరూ సీఎం ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు. మండలి ఛైర్మన్ ఇద్దరి రాజీనామాలకు ఆమోదం తెలిపారు. వీరిద్దరూ ఏడాదికిపైగా జగన్ సర్కార్ కేబినెట్‌లో మంత్రులుగా పనిచేశారు.
Samayam Telugu బోస్, మోపిదేవి రాజీనామా


ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు విజయం సాధించారు. వీరితో పాటూ పరిమళ్ నత్వాని, అయోధ్య రామిరెడ్డిలు కూడా ఎంపీలుగా గెలిచారు. మొత్తం నలుగురు ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. త్వరలోనే వీరు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందుకే చంద్రబోస్, మోపిదేవిలు తమ మంత్రి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.