యాప్నగరం

ఏపీ డిప్యూటీ సీఎం బోస్ రాజీనామా.. ప్రత్యేక హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు

డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్ బుధవారం మండలి ఛైర్మన్‌కు తన రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బోస్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 1 Jul 2020, 2:03 pm
ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాస్ చంద్రబోస్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. బుధవారం మండలి ఛైర్మన్‌కు లేఖను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బోస్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదేమోనని అనుకుంటున్నానని.. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ సుదీర్ఘ పోరాటం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని తనకు నమ్మకం లేదని.. అది కూడా తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పుకొచ్చారు.
Samayam Telugu పిల్లి సుభాష్ చంద్రబోస్


రెవెన్యూశాఖ మంత్రిగా ఏడాది కాలం సంతృప్తిగా పనిచేశానంటున్నారు బోస్. ప్రజలకు సేవ చేసేందుకు సీఎం జగన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని.. పార్లమెంట్‍కు వెళ్లాలన్న తన చిరకాల కోరిక నెరవేరిందన్నారు. ఎంపీలు ఎవరైనా పార్టీకి విధేయులుగా ఉండాలని.. పార్టీ నిర్ణయాన్ని ఎవరైనా శిరోధార్యంగా భావించాలని ఎంపీ రఘురామ విషయాన్ని ప్రస్తావించారు. బోస్‌తో పాటూ మరో మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా తన పదవికి రాజీనామా చేయనున్నారు. వీరిద్దరూ రాజ్యసభకు ఎన్నికకావడంతో ఎమ్మెల్సీతో పాటూ మంత్రి పదవులుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.