ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు రెబల్ స్టార్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు ఇదో దుర్దినం అని వారు అభిప్రాయపడ్డారు. కృష్ణంరాజు తనను పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. రెబల్ స్టార్ మరణం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘తెలుగు సినిమా దిగ్గజ నటుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ యు కృష్ణంరాజు గారు మనల్ని విడిచిపెట్టారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. బహుముఖ నటనతో, సమాజ సేవతో కోట్లాది మంది హృదయాలను ఆయన గెలుచుకున్నారు. ఆయన మరణం మన తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటును మిగిల్చింది. ఓం శాంతి’’ అని అమిత్ షా తెలుగులో ట్వీట్ చేశారు.
కృష్ణంరాజు మరణం పట్ల ప్రధాని మోదీ సైతం సంతాపం ప్రకటించారు. రాబోయే తరాలు ఆయన సినిమా క్రియేటివిటీని గుర్తుంచుకుంటాయన్నారు. సమాజ సేవలోనూ ముందున్న కృష్ణంరాజు.. రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
1998, 1999ల్లో బీజేపీ తరఫున లోక్ సభకు ఎన్నికైన కృష్ణంరాజు.. కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. కృష్ణంరాజు మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఉభయగోదావరి జిల్లా నుంచి బీజేపీ తరఫున కేంద్ర మంత్రిగా సేవలందించిన మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాన’ని ఆయన ట్వీట్ చేశారు.
‘‘ప్రముఖ నటులు, మాజీ కేంద్ర మంత్రి శ్రీ కృష్ణంరాజు గారి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. నటునిగా విభిన్న పాత్రలలో మెప్పించిన కృష్ణంరాజు గారు, రాజకీయాలలో కూడా నిజాయితీతో ప్రజలకు సేవలు అందించారు. ఆయన మృతి తెలుగు నేలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’’ని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
కృష్ణంరాజు మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, 'రెబల్ స్టార్' గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని తెలంగాణ సీఎం పేర్కొన్నారు. లోక్ సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం కేసీఆర్ అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
‘‘కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’నని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
1998, 1999ల్లో బీజేపీ తరఫున లోక్ సభకు ఎన్నికైన కృష్ణంరాజు.. కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. కృష్ణంరాజు మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఉభయగోదావరి జిల్లా నుంచి బీజేపీ తరఫున కేంద్ర మంత్రిగా సేవలందించిన మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాన’ని ఆయన ట్వీట్ చేశారు.
‘‘ప్రముఖ నటులు, మాజీ కేంద్ర మంత్రి శ్రీ కృష్ణంరాజు గారి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. నటునిగా విభిన్న పాత్రలలో మెప్పించిన కృష్ణంరాజు గారు, రాజకీయాలలో కూడా నిజాయితీతో ప్రజలకు సేవలు అందించారు. ఆయన మృతి తెలుగు నేలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’’ని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
‘‘కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’నని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.