యాప్నగరం

గోదావరి విషాదం: రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి

గోదావరి లాంచీ బోల్తాపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ట్వీట్‌లు.

Samayam Telugu 15 Sep 2019, 7:49 pm
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర లాంచీ బోల్తా ఘటన పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో గల్లంతైనవారిలో 10మంది మృతదేహాలు రెస్క్యూ టీమ్‌లు వెలికి తీశారు. అలాగే ప్రమాదంలో 12మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదంలో గల్లంతైన వారి కోసం స్థానికులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు.
Samayam Telugu pm.


Read Also: గోదావరి లాంచీ ప్రమాదం: కంట్రోల్ రూమ్‌లు, టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు

ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటుంబాలకు
సానుభూతిని తెలిపారు. గల్లంతైన సురక్షితంగా బయటపడాలని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాక్షించారు.

ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో స్పందించిన ప్రధాని.. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. ప్రధాని తన ట్వీట్‌లో ‘ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి’అన్నారు.
ఇటు ఉపరాష్ట్రపతి వెంకయ్య కూడా ఘటనపై ఆరా తీశారు. ట్విట్టర్‌లో స్పందించారు.‘తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద గోదావరిలో యాత్రికుల బోటు ప్రమాద ఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’అన్నారు.
గోదావరిలో లాంచీ ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. గల్లంతైన వారు కూడా సురక్షితంగా బయటపడాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.