యాప్నగరం

తిరుమలలో ప్రధాని మోదీ సోదరుడు.. సీఏఏపై కీలక వ్యాఖ్యలు

ప్రధాన మంత్రి సోదరుడు ప్రహ్లాద్ మోదీ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దేశంలో సీఏఏ, ఎన్ఆర్సీలపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలిగిపోవాలని కోరినట్లు చెప్పారు.

Samayam Telugu 25 Feb 2020, 6:04 pm
ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు వేద మంత్రోచ్ఛరణ మధ్య స్వాగతం పలికారు. పట్టువస్త్రాలు సమర్పించారు.
Samayam Telugu Modi


అనంతరం ఆలయం వెలుపల ప్రహ్లాద్ మోదీ మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్‌సీ)పై దేశంలో ప్రస్తుతం వివాదం చెలరేగుతోందన్నారు. అయితే ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టించేలా కొంతమంది వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ప్రచారాన్ని ముస్లింలు ఎవరూ నమ్మవద్దని పిలుపునిచ్చారు..

దేశ ప్రజలను తప్పు దోవపట్టిస్తున్న కొంత మందికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు ప్రహ్లాద్ మోదీ చెప్పారు. సీఏఏ, ఎన్ఆర్సీలపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలిగిపోవాలని ప్రార్థించినట్లు తెలిపారు. భగవంతుని కృపతో దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.