యాప్నగరం

జగన్‌కు మోదీ ఫోన్.. జాగ్రత్తగా ఉండాలని సీఎంకు ప్రధాని సూచన

సీఎం జగన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. కరోనా కేసులు పెరగడంతో పాటూ నియంత్రణా చర్యలపై చర్చించిన ప్రధాని. అప్రమత్తంగా ఉండాలని జగన్‌కు ప్రధాని సూచన.

Samayam Telugu 6 Apr 2020, 7:44 am
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఫోన్ చేశారు. కరోనా వైరస్ నియంత్ర చర్యలతో పాటూ.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంపై ఆరా తీశారు. రాష్ట్రంలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడానికి గల కారణాలను.. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను సీఎం ప్రధానికి వివరించారు. ఈ సందర్భంలో అప్రమత్తంగా ఉండాలని జగన్‌కు ప్రధాని సూచించారు.
Samayam Telugu pm.


Read Also: గుడ్ న్యూస్: ఏపీలో ఆర్టీసీ బస్సుల రిజర్వేషన్లు షురూ!

అలాగే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని వైఎస్‌ జగన్‌ ప్రధానికి తెలిపారు. కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై ఇటీవలే లేఖ రాశానని గుర్తుచేశారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించి రూ.2,200 కోట్లు.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.2,100 కోట్లు.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు రూ.1,100 కోట్లు.. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ.1,050 కోట్ల.., జీఎస్టీ పరిహారం కింద రూ.900 కోట్లు ఇప్పించాలని ప్రధానిని కోరారు. ప్రధాని కూడా సానుకూలంగా స్పందిస్తూ.. లేఖలోని అంశాలు తన దృష్టికి వచ్చాయని.. తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read: 'వైసీపీ ఎమ్మెల్యే ఆరోగ్యం బాగుపడితే అమ్మోరికి తలనీలాలు ఇస్తా'

ఇటు సీఎం జగన్‌ కూడా అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ కరోనా టెస్టింగ్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకురావాలని, ఇప్పుడున్న ల్యాబ్ ల సామర్థ్యం పెంచాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.