యాప్నగరం

కరోనాతో తెలుగు జర్నలిస్ట్ మరణం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

బ్రహ్మానందం 10 రోజుల క్రితం కరోనా బారిన పడగా.. ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.. అక్కడే చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు.

Samayam Telugu 8 Apr 2020, 12:40 pm
కరోనా కాటుకు అమెరికాలో తెలుగు జర్నలిస్ట్ కంచిభొట్ల బ్రహ్మానందం బలయ్యారు. ఆయన మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. సంతాపం వ్యక్తం చేశారు. భారత్-అమెరికా మెరుగైన సంబంధాలు కోసం ఆయన చేసిన కృషి , సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు సానుభూతి ప్రకటించారు.. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అన్నారు.
Samayam Telugu modi.


Read Also: న్యూయార్క్‌లో కరోనా కాటు: ప్రముఖ తెలుగు జర్నలిస్ట్ మరణం

బ్రహ్మానందం ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ఏదుబాడు గ్రామం కాగా సీనియర్ జర్నలిస్టుగా మంచి గుర్తింపు పొందారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో పలు పత్రికల్లో కూడా పని చేశారు. తర్వాత అమెరికాలోని న్యూయార్క్‌లో కుటుంబంతో ఆయన స్థిరపడ్డారు. అక్కడ ఓ ప్రముఖ పత్రికలో పనిచేస్తున్నారు. 10 రోజుల క్రితం కరోనా బారిన పడగా.. ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.. అక్కడే చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు. ఆయన మృతితో సొంత ఊరిలో విషాదఛాయలు అలుముకున్నాయి.. బ్రహ్మానందం మరణంపై పలువురు జర్నలిస్టులు, సంఘాలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.