పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆసక్తికర సీన్ కనిపించింది. శుక్రవారం రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో సహా కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన రఘురామరాజు, ముందు వరుసలో కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే పక్కన కూర్చున్నారు. మిగిలిన ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుతో పాటు బయటకు వెళుతున్నారు. ఇంతలో ఎంపీ రఘురామ కూర్చున్న సీటు దగ్గర ప్రధాని మోదీ ఆగారు. రఘురామను చూస్తూ ‘రాజు గారు ఎలా ఉన్నారు?’ అని పలకరించారు. రఘురామ చేతులు జోడించి ‘బాగున్నాను సార్’ అని బదులిచ్చారు. కొంచెం సేపు నిలబడి భుజం తట్టి వెళ్లారు. అంతకు ముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా రఘురామరాజును పలకరించారు.
ముందు వరుసలో కూర్చున్న రఘురామ.. ఎంపీ దగ్గరకు వచ్చిన ప్రధాని, పార్లమెంట్లో ఆసక్తికర సీన్
శుక్రవారం రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో సహా కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన రఘురామరాజు, ముందు వరుసలో కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే పక్కన కూర్చున్నారు.
Samayam Telugu 27 Nov 2021, 6:13 am
ప్రధానాంశాలు:
- పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆసక్తికర సీన్
- ముందు వరుసలో కూర్చున్న రఘురామ
- రఘురామను పలకరించిన ప్రధాని మోదీ