యాప్నగరం

ఏపీ సీఎం జగన్‌కు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శుభకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలి అంటూ ఆకాంక్షించిన ప్రధాని.

Samayam Telugu 21 Dec 2019, 9:29 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు (డిసెంబర్ 21) 47వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. బర్త్ డే సందర్భంగా సీఎం జగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. జగన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలి అంటూ ఆకాంక్షించారు.
Samayam Telugu ys jagan

ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలతో పాటూ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి జగన్‌ తన పుట్టిన రోజు నాడే కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.

తన పుట్టినరోజు నాడే ఈ పథకం ప్రారంభించడం వెనుక ఆసక్తికర కారణం ఉందట. తనకు చేనేతలే గుర్తు వచ్చారన్నారు జగన్. అమ్మ ఒడి, నాడు-నేడు లాంటి ప్రతిష్టాత్మక పథకాలెన్నో ఉండగా దీన్ని మాత్రమే తన బర్త్‌డే రోజు లాంచ్ చేయడం ఏమిటి అని చాలామంది సందేహం వ్యక్తం చేశారు. చేనేతలతో తన తండ్రి వైయస్సార్‌కి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునేందుకే సీఎం జగన్ తన పుట్టిన రోజున నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.