యాప్నగరం

వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ్‌రెడ్డిపై కేసు నమోదు

తాజాగా కర్నూలు జిల్లా నందికొ​ట్కూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిపై.. నందికొట్కూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Samayam Telugu 14 Apr 2020, 6:43 am
ఏపీలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. అధికారులు, పోలీసులు సమన్వయంతో పక్కాగా నిబంధనల్ని అమలు చేస్తున్నారు. ప్రజలెవరూ రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా వస్తే మాస్క్‌ ధరించడంతో పాటూ సామాజిక దూరంగా పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేయవారిపై చర్యలు చేపడుతున్నారు.. అక్కడక్కడా వాహనాలను సీజ్ చేస్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్ పాటించని ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలపైనా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.
Samayam Telugu sidhu


తాజాగా కర్నూలు జిల్లా నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిపై.. నందికొట్కూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఆదివారం హైపో ద్రావణం పిచికారీ చేసేందుకు వచ్చిన వారు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని, భౌతిక దూరం పాటించలేదని వారిపై.. వారి అనుచరులు కొంత మందిపై కేసు నమోదు చేశారు.

ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ నిబంధనలు పాటించాల్సిందేనని.. ఒకవేళ పట్టించుకోకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై కూడా కేసు నమోదైన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు కేసు ఫైల్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.