యాప్నగరం

విశాఖ: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు

అయ్యన్నపాత్రుడు తాత, మాజీ ఎమ్మెల్సీ రుత్తల లచ్చాపాత్రుడు చిత్రపటం మునిసిపల్‌ కార్యాలయంలో తొలగించారని వివాదం రేగింది. వివరణ ఇచ్చినా అయ్యన్నపాత్రుడు దుర్భాషలాడారని మున్సిపల్ కమిషనర్ ఆరోపించారు.

Samayam Telugu 18 Jun 2020, 7:06 am
మాజీ మంత్రి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదైంది. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని అసభ్యంగా దూషించారనే ఆరోపణలపై ఆమె చేసిన ఫిర్యాదుతో నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్‌ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం పోలీసులు కేసు ఫైల్ చేశారు.
Samayam Telugu అయ్యన్నపాత్రుడు


Read Also: విశాఖ: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు

అయ్యన్నపాత్రుడు తాత, మాజీ ఎమ్మెల్సీ రుత్తల లచ్చాపాత్రుడు చిత్రపటం మునిసిపల్‌ కార్యాలయంలో తొలగించారని వివాదం రేగింది. దీంతో గవిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో బహిరంగ సమావేశం నిర్వహించారు.. అయ్యన్నపాత్రుడు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సభలో తనను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని మున్సిపల్ కమిషనర్ ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌ ఆధునీకరణ పనులు చేపట్టడంతో అయ్యన్నపాత్రుడు తాత లత్సాపాత్రుడు చిత్రపటాన్ని అధికారులు చైర్మన్‌ గదిలోకి మార్చారట. తన తాత ఫోటోను యథాస్థానంలో ఉంచాలంటూ అయ్యన్నపాత్రుడు ఈనెల 15న మున్సిపల్‌ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలతో నిరసనకు దిగారు. హాల్‌కు రంగులు వేస్తున్నామని నెల రోజుల్లో చిత్రపటాన్ని యథాస్ధానంలో ఉంచుతామని కమిషనర్‌ వివరణ ఇచ్చినా అయ్యన్నపాత్రుడు దుర్భాషలాడారని ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.