యాప్నగరం

ఎంపీ గల్లాపై నాన్ బెయిలబుల్ కేసులు.. సబ్‌జైలుకు తరలింపు

ఎంపీ గల్లా జయదేవ్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు. అర్దరాత్రి వరకు గుంటూరు పరిసర ప్రాంతాల్లో హైడ్రామా. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు.. బెయిల్ నిరాకరణ.. సబ్ జైలుకు తరలింపు.

Samayam Telugu 21 Jan 2020, 7:45 am
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అరెస్ట్‌తో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. సోమవారం అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన జయదేవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత జయదేవ్‌ను దుగ్గిరాల, పెదకాకాని, గుంటూరు మీదుగా నరసరావుపేట.. అక్కడి నుంచి రొంపిచర్ల స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఆయనపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
Samayam Telugu galla


గల్లా జయదేవ్ అరెస్ట్ గురించి తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు,అనుచరులు.. ఆయన్ను తరలిస్తున్నా కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. తర్వాత అర్ధరాత్రి 12.30 గంటలకు జీజీహెచ్‌ వైద్యులతో జయదేవ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అర్దరాత్రి 1 గంట వరకు హైడ్రామా కొనసాగింది. గల్లాను పోలీస్ స్టేషన్లు తిప్పి మూడు గంటలకు మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. బెయిల్ కోస ప్రయత్నించగా.. మంగళగిరి మేజిస్ట్రేట్ నిరాకరించారు. ఎంపీకి జనవరి 31వరకు రిమాండ్ విధించడంతో.. తెల్లవారు జామున 4.30గంటలకు గుంటూరు సబ్ జైలుకి తరలించారు.

పోలీసుల తీరుపై గల్లా జయదేవ్ మండిపడ్డారు. తనపై పోలీసులు దాడి చేశారని.. తన చొక్కా చించేశారని.. తన ఒంటిపై ఉన్న దెబ్బల్ని కూడా చూయించారు. తన తాత బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకు వెళ్లారని.. తాను కూడా ప్రభుత్వం తీసుకున్న అప్రజాస్వామికమై నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లానన్నారు. అమరావతి కోసం తన పోరాటం కొనసాగుతుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.