యాప్నగరం

కాల్వలో పడిన మహిళ.. ఏ మాత్రం ఆలోచించకుండా దూకేసిన పోలీస్

ప్రమాదవశాత్తూ కాల్వలో పడి కొట్టుకుపోతున్న మహిళను కాపాడారు ఓ ఎస్సై. వెనుకా ముందు ఆలోచించకుండా కాల్వలో దూకేసి మహిళ ప్రాణాలు కాపాడిన ఘటన విజయవాడ నగరంలో చోటుచేసుకుంది.

Samayam Telugu 2 Dec 2019, 11:00 pm
కాల్వలో పడి కొట్టుకుపోతున్న మహిళను ఓ ఎస్సై ధైర్య సాహసాలు ప్రదర్శించి కాపాడారు. ఏ మాత్రం ఆలోచించకుండా కాల్వలోకి దూకేసి ఆమెను ఒడ్డుకు చేర్చారు. షాక్‌కు గురై స్పృహ‌త‌ప్పిన మహిళకు ప్రాథమిక వైద్యం అందించారు. దీంతో మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆపదలో ఉన్న వారిని కాపాడడంలో పోలీసులు వెనకాడరని నిరూపించిన ఈ సంఘటన విజయవాడ నగరంలో జరిగింది.
Samayam Telugu police.


నగరంలోని కృష్ణలంక సమీపంలోని బందరు కాల్వలో ఓ మహిళ ప్రమాదవశాత్తూ పడిపోయింది. కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను చూసి స్థానికులు పెద్దగా కేకలు వేశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ట్రాఫిక్ ఎస్సై అర్జునరావు కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను చూసి ఒక్క ఉదుటున నీళ్లలోకి దూకేశారు. మహిళ ప్రాణం కాపాడేందుకు ఏమాత్రం ఆలోచించకుండా కాల్వలో దూకారు. ఈదుకుంటూ ఆమె వద్దకు వెళ్లి కష్టపడి ఒడ్డుకు చేర్చారు.

Also Read: చంద్రబాబు మా గురువు.. కానీ.. మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

కాల్వలో పడిపోయిన షాక్‌కు గురై మహిళ స్పృహ‌త‌ప్పడంతో ప్రాథమిక చికిత్స అందించారు. సకాలంలో స్పందించి సీపీఆర్ చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. మహిళ ప్రాణాలు కాపాడడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఎస్సై అర్జున రావును పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏపీ పోలీస్ బాస్ గౌతం సవాంగ్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రమాదంలో ఉన్న మహిళను కాపాడిన ఎస్సై అర్జునరావును ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Read Also: పార్లమెంట్‌లో ‘దిశ’ ఘటనపై తీవ్ర చర్చ.. హాయిగా నిద్రపోయిన వైసీపీ ఎంపీ.!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.