యాప్నగరం

విజయవాడలో నోట్ల కట్టల కలకలం, రూ.కోటి విలువ.. ఆరా తీసి పోలీసులు అవాక్కు

విజయవాడ బస్టాండ్ సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తుల దగ్గర తనిఖీ చేశారు. వారి దగ్గరున్న లగేజీని పరిశీలించి అవాక్కయ్యారు.

Samayam Telugu 30 Nov 2020, 8:08 am
విజయవాడలో నోట్ల కట్టల కలకలంరేపింది. విజయవాడ పండిట్ నెహ్రు బస్ స్టాండ్ దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తుల దగ్గర తనిఖీ చేశారు. వారి దగ్గరున్న లగేజీని పరిశీలించి అవాక్కయ్యారు. ఇద్దరి నుంచి రూ.కోటి నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపించక పోవడంతో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఆ డబ్బును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇంత భారీ స్థాయిలో డబ్బులు దొరకడంతో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu విజయవాడ (File Photo)


ఈ డబ్బును హవాలా మార్గంలో విజయవాడ నుంచి అనంతపురం జిల్లా గుంతకల్లుకి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులు తరలిస్తుండగా ఈ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. హవాలా మూలాలపై టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ శ్రీనివాసులు కూపీ లాగుతున్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తుల నుంచి వివరాలు ఆరా తీస్తున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఇలా డబ్బు పట్టుబడుతూనే ఉంది.. వీటిలో కొన్ని వ్యాపారులకు సంబంధించిన డబ్బు కాగా.. మరికొన్ని హవాలా రూపంలో తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.