యాప్నగరం

అనంతపురం: కరోనా భయంతో అంత్యక్రియలకు బంధువులు దూరం.. మానవత్వం చాటిన ఎస్సై

అనంతపురం జిల్లా ఉరవకొండలోనూ దారుణం జరిగింది. స్థానికంగా ఓ వ్యక్తి వైరస్‌తో చనిపోయాడు. అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.. బంధువులు కూడా మొహం చాటేశారు.

Samayam Telugu 17 Jul 2020, 8:57 am
కరోనా వైరస్ అందర్నీ భయపెడుతోంది. కుటంబంలో ఎవరైనా చనిపోయినా.. కరోనాతో ప్రాణాలు పోయినా అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అనంతపురం జిల్లా ఉరవకొండలోనూ దారుణం జరిగింది. స్థానికంగా ఓ వ్యక్తి వైరస్‌తో చనిపోయాడు. అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.. బంధువులు కూడా మొహం చాటేశారు. దీంతో అతడి భార్యకు దిక్కుతోచలేదు.
Samayam Telugu అనంతపురం జిల్లాలో విషాదం


ఉరవకొండకు చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 15న కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. కానీ ఎవరూ పట్టించుకోలేదు. విషయం తెలియడంతో ఎస్‌ఐ ధరణిబాబు బాధితుడ్ని అనంతపురం తరలించారు. అక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో తన భర్త చనిపోయాడని భార్య ఆరోపించారు.

అతడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎస్‌ఐ వెంటనే స్పందించారు. మృతదేహాన్ని ఉరవకొండకు తీసుకురావాలని.. అంత్యక్రియలు తాను చేయిస్తానని భరోసా ఇచ్చారు. దగ్గరుండి అన్నీ ఏర్పాట్లు చేసి అంత్యక్రియలు చేయించారు. బంధువులు మొహం చాటేసినా ఎస్‌ఐ మాత్రం అండగా నిలవడంతో.. ఆ కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.