యాప్నగరం

టీడీపీకి ట్విస్ట్.. ఎమ్మెల్సీ పదవికి సునీత రాజీనామా

పోతుల సునీత గతంలో టీడీపీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. చంద్రబాబు సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

Samayam Telugu 28 Oct 2020, 1:04 pm
టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్‌కు పంపించారు. గత 15 మాసాలుగా రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా అడుగడుగునా కోర్టులను అడ్డుపెట్టుకుని టీడీపీ, చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ అడ్డుకుంటున్నారన్నారు. టీడీపీ వైఖరి రాజ్యంగా నిర్మాత బి. ఆర్‌. అంబేద్కర్‌ స్ఫూర్తికి తూట్లు పొడుస్తుందని.. దీనికి నిరసనగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వై. ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కొనసాగిస్తున్న పాలనకు మద్దతుగా నిలవాలని రాజీనామా నిర్ణయం తీసుకున్నాను అన్నారు. తన ఈ రాజీనామా లేఖను ఆమోదించాలని కోరారు.
Samayam Telugu ఎమ్మెల్సీ సునీత రాజీనామా


పోతుల సునీత గతంలో టీడీపీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలోకి వచ్చారు.. దీంతో అక్కడ విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో చంద్రబాబు సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2019 ఎన్నికలకు ముందు ఆమంచి వైఎస్సార్‌సీపీలో చేరగా.. ఆమె మాత్రం టీడీపీలో కొనసాగారు. కానీ కొద్దిరోజుల తర్వాత అనూహ్యంగా వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చారు. దీంతో టీడీపీ అనర్హత వేటు వేయాలని శాసనమండలి ఛైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేయగా.. విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే సునీత తన పదవికి రాజీనామా చేసి ట్విస్ట్ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.