యాప్నగరం

చంద్రబాబు లీడర్‌షిప్‌కు జిందాబాద్.. వైసీసీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై వైసీపీ నాయకుడు ప్రసాద్ వి.పొట్లూరి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు.

Samayam Telugu 15 Feb 2020, 10:11 pm
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాద్ వి.పొట్లూరి (పీవీపీ) వ్యంగ్యాస్త్రాలు మరోసారి సంధించారు. ఈ మేరకు శనివారం పీవీపీ ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఐటీ దాడుల్లో రూ. 2,000 కోట్ల అక్రమాలు జరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని విపక్ష నేత చంద్రబాబుతో ముడిపెడుతూ పీవీపీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Samayam Telugu Chandrababu


Also Read: రూ. 2 వేల కోట్ల అక్రమాలు.. అడ్డంగా దొరికిన చంద్రబాబు మాజీ పీఎస్

‘‘సార్, రూ. 2000 కోట్లు లావాదేవీలు చేసే సెక్రటరీని తయారు చేసారంటే, మీ లీడర్‌షిప్‌కు జిందాబాద్. ఇక మీ మేనేజర్లు, నాయకులకు ఎన్ని రూ. లక్షల కోట్లో ! సార్ మాకు అలాంటి సెక్రటరీని ఒకరిని చూసిపెట్టండి. అసలే కష్ట కాలంలో ఉన్నాం. తెలుగు రాష్ట్రాలకు అన్నీ మీరే చేసిపెట్టారు, మాకు కూడా’’ అంటూ విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)తో పాటు పలువురిపై ఐటీ అధికారులు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నంతో పాటు ఢిల్లీ, పుణే సహా 40 ప్రాంతాల్లో సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 2,000 కోట్లు చేతులు మారినట్లు భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: అదే జరిగితే బీజేపీతో పొత్తు తెంచేసుకుంటా.. పవన్ కళ్యాణ్ సంచలనం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.